
సలాం ప్రొద్దుటూరు:
తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి, నంద్యాల కొండారెడ్డి ఆధ్వర్యంలో 22వ వార్డులో డోర్ టు డోర్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో వాక్ఫ్ బోర్డు డైరెక్టర్ బేపారి జాకీర్ అహమ్మద్, క్లస్టర్ ఇన్చార్జ్ తలారి రమేష్, బేపారి ఆరీఫ్ అహమ్మద్, బూత్ ఇన్చార్జి మాదూర్ మున్నా, ఇనాయతుల్లా, పీరు, రఫీక్, అలీ తదితరులు పాల్గొన్నారు.
ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, వారి సమస్యలను తెలుసుకున్నారు.

