సలాం ప్రొద్దుటూరు (నెల్లూరు):
మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే రొట్టెల పండగ ఈ నెల 26 నుం చి 30వ తేదీ వరకు నెల్లూరులోని బారాషహీద్ దర్గాలో జరగనుంది. రొట్టెల పండగ ఏర్పాట్లపై మంత్రి పొంగూరు నారాయణ వివిధ శాఖల అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహిం చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కలెక్టర్ హిమాన్షు శుక్లా మాట్లాడుతూ పార్కింగ్, ట్రాఫిక్ మళ్లింపు సమాచారాన్ని ఎప్పటికప్పుడు భక్తులకు తెలిసేలా సమాచార శాఖ, మీడియా ద్వారా విస్త్రత ప్రచారం కల్పించాలన్నారు. అనంతరం మంత్రి, కలెక్టర్, ఎస్పీ అజిత వేజెండ్ల, రాష్ట్ర వక్స్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ తదితరులతో కలిసి దర్గా ప్రాంగణంలో జరుగుతున్న ఏర్పాట్లను పరి శీలించారు. ఈ సమావేశంలో మేయర్ దేవరకొండ సుజాత, డిప్యూటీ మేయర్ పోలుబోయిన రూపుమార్యాదవ్, కమిషనర్ నందన్, ఏఎస్పీలు సౌజన్య, దీక్ష, నెల్లూరు ఆర్డీఓ అనూష, కోటంరెడ్డి గిరిధర్రెడ్డి, దర్గా కమిటీ చైర్మన్ మునీర్ బాషా తదితరులు పాల్గొన్నారు. కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం
రొట్టెల పండగ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం
సోమవారం జరిగింది. ఫెస్టివల్ కమిటీ చైర్మన్ గా మునీర్ బాషా, సభ్యులుగా 110 మం ది దర్గా ప్రాంగణంలో ప్రమాణస్వీకారం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, రాష్ట్ర వక్బర్డు చైర్మన్ అబ్దుల్అజీజ్, బేపారి జాకిర్,మేయర్ దేవర
కొండ సుజాత తదితరులు పాల్గొన్నారు.
