ePaper
Friday, September 4, 2026
ePaper
Homeఎడిటోరియల్శభాష్ పోలీస్.. సీసీ కెమెరాలతో రూ.10 లక్షల బంగారు నగలు గుర్తింపు

శభాష్ పోలీస్.. సీసీ కెమెరాలతో రూ.10 లక్షల బంగారు నగలు గుర్తింపు

📰 Generate e-Paper Clip

 

సలాం ప్రొద్దుటూరు:

ఆటోలో ప్రయాణిస్తుండగా అనుకోకుండా కిందపడిపోయిన సుమారు రూ.10 లక్షల విలువైన బంగారు ఆభరణాలతో కూడిన బ్యాగ్‌ను ప్రొద్దుటూరు 1 టౌన్ పోలీసులు చాకచక్యంగా గుర్తించి బాధితురాలికి అప్పగించారు. పోలీసుల సమయస్ఫూర్తి, సీసీ కెమెరాల వినియోగంపై ప్రజలు అభినందనలు వ్యక్తం చేశారు.

 

నేతాజీ నగర్‌కు చెందిన ఎస్.కె. ప్యారిజాన్ (70) ఈ రోజు న ( గురువారం) ఆటోలో ఇంటి నుంచి ప్రొద్దుటూరు పాత బస్టాండ్‌కు వెళ్తుండగా, మార్గమధ్యంలో ఆమె వద్ద ఉన్న బ్యాగ్ ఆటో నుంచి జారిపడిపోయింది. పాత బస్టాండ్‌కు చేరుకున్న తర్వాత బ్యాగ్ కనిపించకపోవడంతో ఆమె వెంటనే ప్రొద్దుటూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి పోలీసులకు సమాచారం అందించారు.

 

వెంటనే స్పందించిన ఇన్‌స్పెక్టర్ టి.వి. కొండారెడ్డి ఆధ్వర్యంలో ఎస్‌ఐ శ్రీనివాసులు, సిబ్బంది లాల్ పీరా, రామచంద్ర, శివకుమార్‌లు ఆటోను గుర్తించడంతో పాటు మార్గమధ్యంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. సీసీ కెమెరాల ఆధారంగా ఆర్ట్స్ కాలేజీ సమీపంలో బ్యాగ్ పడిపోయినట్లు గుర్తించి, అక్కడ గాలింపు చేపట్టి బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్నారు.

 

బ్యాగ్‌లో ఉన్న సుమారు రూ.10 లక్షల విలువైన బంగారు ఆభరణాలను సురక్షితంగా బాధితురాలు ఎస్.కె. ప్యారిజాన్‌కు అప్పగించారు.

 

ఈ సందర్భంగా పోగొట్టుకున్న విలువైన ఆభరణాలను తక్షణమే స్పందించి సీసీ కెమెరాల సహాయంతో గుర్తించి బాధితురాలికి అప్పగించడంలో ప్రతిభ కనబరిచిన ఎస్‌ఐ శ్రీనివాసులు, పోలీసు సిబ్బందిని ఇన్‌స్పెక్టర్ టి.వి. కొండారెడ్డి అభినందించారు.

 

శభాష్ పోలీస్.. ప్రజల సొమ్ముకు భద్రత, ప్రజలకు అండగా నిలిచిన ప్రొద్దుటూరు 1 టౌన్ పోలీసులకు సెల్యూట్! 👏🚔

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!