–ఎంపీడీవో కార్యాలయంలో కూటమి పార్టీల ప్రతినిధుల సమావేశం..
– జాబితా అందజేత
సలాం ప్రొద్దుటూరు:
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ స్టేషన్ల జాబితా పరిశీలన, అభ్యంతరాల స్వీకరణపై ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం అన్ని పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అధికారులు పోలింగ్ స్టేషన్లకు సంబంధించిన జాబితాను ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందజేశారు. జాబితాను పరిశీలించి ఏవైనా అభ్యంతరాలు, సూచనలు ఉంటే నిబంధనల ప్రకారం తెలియజేయాలని అధికారులు సూచించారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయ కమిటీ సభ్యులు రామారావు, జనసేన పార్టీ నాయకులు జిలాన్ బాషా, తాలమాపురం మంచి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
