సలాం ప్రొద్దుటూరు:
శ్రావణ శుక్రవారం, వరలక్ష్మీ వ్రతాన్ని పురస్కరించుకుని ప్రొద్దుటూరు పప్పుల బజార్ వీధిలోని శ్రీ గంగమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా శ్రీ గంగమ్మ తల్లి వరమహాలక్ష్మీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు, అభిషేకాలు నిర్వహించారు. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అమ్మవారి దర్శనంతో ఆలయ ప్రాంగణం భక్తిశ్రద్ధలతో సందడిగా మారింది. భక్తులు అమ్మవారిని దర్శించుకుని కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, ఐశ్వర్యం ప్రసాదించాలని ప్రార్థించారు.
