ePaper
Saturday, August 1, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్మున్సిపల్ హెచ్‌పీసీఎల్ పెట్రోల్ బంకుపై కమిషనర్ ఆకస్మిక తనిఖీ

మున్సిపల్ హెచ్‌పీసీఎల్ పెట్రోల్ బంకుపై కమిషనర్ ఆకస్మిక తనిఖీ

📰 Generate e-Paper Clip

 

 

–మూడు రోజులుగా పెట్రోల్ స్టాక్ లేకపోవడంపై ఆగ్రహం..

–ఇద్దరు సిబ్బందికి తాఖీదులు

 

సలాం ప్రొద్దుటూరు:

ప్రొద్దుటూరు పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హెచ్‌పీసీఎల్ పెట్రోల్ బంకును మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పెట్రోల్ బంకు నిర్వహణ, ఇంధన నిల్వలు, సేవల నాణ్యత, పారదర్శకతపై సమగ్రంగా పరిశీలించి అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.

 

పెట్రోల్ స్టాక్ లేకపోవడంపై ఆగ్రహం

 

గత మూడు రోజులుగా పెట్రోల్ స్టాక్ లేకపోవడాన్ని గుర్తించిన కమిషనర్, ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ఉన్నతాధికారులకు వెంటనే తెలియజేయకపోవడంపై సిబ్బందిని ప్రశ్నించి అసంతృప్తి వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించిన ఇద్దరు సిబ్బందికి వివరణ కోరుతూ తాఖీదులు జారీ చేయాలని ఆదేశించారు.

 

రికార్డుల పరిశీలన.. నిర్వహణపై సమీక్ష

 

పెట్రోల్ బంకు నిర్వహణ విధానం, స్టాక్ రిజిస్టర్లు, ఇతర రికార్డులను కమిషనర్ క్షుణ్ణంగా పరిశీలించారు. ఇంధన సరఫరాలో ఎలాంటి అంతరాయం తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

 

నాణ్యత, పారదర్శకతకు ప్రాధాన్యం

 

ఇంధన నాణ్యతలో ఎలాంటి రాజీ ఉండకూడదని, కొలతల్లో పూర్తి పారదర్శకత పాటించాలని కమిషనర్ సూచించారు. వినియోగదారులకు వేగవంతమైన, నాణ్యమైన సేవలు అందిస్తూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా బంకు నిర్వహణ ఉండాలని స్పష్టం చేశారు.

 

పరిశుభ్రత, భద్రతా ప్రమాణాలు తప్పనిసరి

 

పెట్రోల్ బంకు ప్రాంగణంలో పరిశుభ్రత, భద్రతా ప్రమాణాలను ఎల్లప్పుడూ పాటించాలని, పరిసరాలను పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా ఉంచాలని అధికారులకు సూచించారు. ప్రజలకు విశ్వసనీయమైన సేవలు అందించడమే పురపాలక సంఘం ప్రధాన లక్ష్యమని కమిషనర్ తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్ పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!