సలాం ప్రొద్దుటూరు (కడప):
రెండు రోజుల క్రితం కోటిరెడ్డి సర్కిల్ సమీపంలో కొంతమంది పై విచక్షణా రహితంగా దాడి చేసిన హిజ్రాలు..ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలకు ఎస్పీ ఆదేశం. ఘటనపై సమగ్రంగా విచారించిన సీఐ తిమ్మారెడ్డి,ఎస్సై ప్రదీప్ కుమార్..ఏడు మంది హిజ్రాల తో పాటు, మరో ఏడు మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు..హిజ్రాలకు స్టేషన్ ఆవరణంలో కౌన్సెలింగ్ నిర్వహించిన సిఐ..బలవంతపు వసూళ్లకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరిక..కడప శివారు ప్రాంతాల్లో రహదారులపై ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని, అలా కాదని చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం.
