సలాం ప్రొద్దుటూరు (కొండాపురం):
కొండాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మాపురం క్రాస్ వద్ద శుక్రవారం సాయంత్రం గ్రామస్తులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్.ఐ జయరాముడు మాట్లాడుతూ…సైబర్ నేరాలు (Cyber Crimes): ఆన్లైన్ మోసాలు, బ్యాంక్ ఫ్రాడ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.బాల్య వివాహాలు (Child Marriages): బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని అవగాహన కల్పించారు. సామాజిక అంశాలు: చీటింగ్, ఫ్యాక్షన్, సోషల్ మీడియా దుర్వినియోగం వల్ల కలిగే నష్టాలు వివరించారు.మహిళా రక్షణ: ‘శక్తి’ యాప్ వంటి సాంకేతికతను ఉపయోగించడం మరియు మహిళలకు రక్షణ కల్పించే వివరాలు తెలిపారు.చట్టపరమైన అవగాహన: గ్రామస్తులలో చట్టంపై, గ్రామాల్లో ప్రశాంతతను కాపాడటంపై అవగాహన కల్పించడం జరిగింది.
