సలాం ప్రొద్దుటూరు:
స్థానిక శ్రీ అగస్త్యేశ్వర స్వామి దేవస్థానంలో మంగళ వారం నుండి శ్రీ అగస్త్యేశ్వర స్వామి వారితో పాటు శ్రీ అభయ వరద శ్రీ సీతారామచంద్ర స్వామి వార్ల మహా కుంభాభిషేక మహోత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య ప్రారంభమయ్యాయి. మొదటి రోజు గోపూజ, గణపతి పూజ, వాస్తు హోమం, యాగశాల ప్రవేశం, త్రిశూల పూజ, షోడశ కలశ స్నపణం, అగ్ని ప్రతిష్టాపన, ప్రధాన కలశ స్థాపన, రుద్ర హోమాలు వంటి కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో కె.వి. రమణ, చైర్మన్ వంగల నారాయణరెడ్డి, పాలకమండలి సభ్యులు, పురోహితులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
