సలాం ప్రొద్దుటూరు (అన్నమయ్య ):
ఎన్నికలకు ముందు ఉద్యోగులకు ఇచ్చిన హామీలను రెండేళ్లుగా కూటమి ప్రభుత్వం అమలు చేయలేదని ,పిఆర్సి కమిషన్ వెంటనే నియమించి ఐ ఆర్ తక్షణమే ప్రకటించాలని జిల్లా అధ్యక్షుడు నరసింహ కుమార్ డిమాండ్ చేశారు. గురువారం రాయచోటి లో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.డిఎ, పిఆర్సి, ఎస్ఎల్ తదితర బకాయిలు పెండింగ్ డిఎ వెంటనే చెల్లించాలనీ ,కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. డిమాండ్ చేశారు.రిటైర్డ్ ఉద్యోగులకు క్వాంటం ఆఫ్ పెన్షన్ ను పునరుద్ధరించాలి.కేంద్ర ప్రభుత్వం మహిళ ఉద్యోగులకు ఇస్తున్న రెండు సంవత్సరాలు చైల్డ్ కేర్ లీవ్ ను రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు కూడా అమలు చేయాలనీ,ఉద్యోగికి రావాల్సిన బగాయిలను పేస్లిప్ లో చూపించాలి,పొదుపుచర్ల లో భాగంగా ఉద్యోగులందరికీ ఐదు రోజులు పని దినాలు అమలు చేయాలనీ,.సరెండర్ లీవ్ లు ఎప్పటికప్పుడు చెల్లించాలనీ,ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం తప్పద నీ హెచ్చరించారు.
