సలాం ప్రొద్దుటూరు :
వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు జగన్ అభిమానులు శుక్రవారం జరిగే వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమంలో భాగంగా జగన్ పిలుపుమేరకు ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడుతూ నిర్వహిస్తున్న భారీ నిరసన ర్యాలీ లో పాల్గొని విజయవంతం చేయాలని రాష్ట్ర వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పిలుపునిచ్చారు.ఈ ర్యాలీలో గ్రామ , వార్డు కమిటీ అధ్యక్షులు, కార్యదర్శులు, కన్వీనర్లు, గృహ సారథులు, పార్టీ శ్రేణులు, అభిమానులు మరియు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. ఈ ర్యాలీ మున్సిపల్ పార్క్ నుంచి మొదలుకొని గాంధీ రోడ్డు మీదుగా టీబి రోడ్డు మార్గంలో వెళ్లి తహసిల్దార్ కార్యాలయం చేరుకుంటారని వివరించారు.
