సలాం ప్రొద్దుటూరు:
అన్నదాతలకు గుడ్యూస్. నైరుతి రుతుపవనాలు భారత్లోకి ఎంట్రీ ఇచ్చాయి. కొద్దిసేపటి క్రితమే కేరళ ను తాకాయి. మరికొద్ది రోజుల్లో దేశవ్యాప్తంగా విస్తరించనున్నాయి. జూన్ రెండో వారంలో ఏపీ, తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీంతో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే ఈ సారి ఎల్నినో ప్రభావంతో వర్షాలు తగ్గే ఛాన్స్ ఉందని IMD ఇప్పటికే తెలిపింది.
