సలాం ప్రొద్దుటూరు (దువ్వూరు):
దువ్వూరులోని దేవాన్ష్ కళ్యాణ మండపంలో గురువారం జరిగిన రెండు వివాహ వేడుకలకు మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా నంద్యాల రమణారెడ్డి కుమారుడి వివాహంతో పాటు ఎఫ్బీ ఫంక్షన్ హాల్ నిర్వాహకులు దొంతా వెంకటసుబ్బయ్య గౌడ్ కుమారుడి వివాహ వేడుకలో పాల్గొన్న మల్లెల లింగారెడ్డి, నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి దాంపత్య జీవితం ఆనందమయం, ఆయురారోగ్యాలతో, ఐశ్వర్య సౌభాగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.
