ePaper
Saturday, August 1, 2026
ePaper
Homeఎడిటోరియల్డీఆర్వోకు వైఎస్సార్సీపీ కోర్ కమిటీ ఫిర్యాదు

డీఆర్వోకు వైఎస్సార్సీపీ కోర్ కమిటీ ఫిర్యాదు

📰 Generate e-Paper Clip

 

–మెగా డీఎస్సీ, ‘తల్లికి వందనం’ పథకంలో అవకతవకలపై విచారణ కోరిన నాయకులు

 

సలాం ప్రొద్దుటూరు (కడప):

 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కోర్ కమిటీ సభ్యులు శుక్రవారం కడప జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) మల్లికార్జునుడును కలిసి పలు ప్రజా అంశాలపై వినతిపత్రం సమర్పించారు.

 

అంతకుముందు కడపలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన కోర్ కమిటీ సమావేశంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. సమావేశంలో కూటమి ప్రభుత్వం నిర్వహించినట్లు పేర్కొన్న మెగా డీఎస్సీ ప్రక్రియలో చోటుచేసుకున్నట్లు ఆరోపిస్తున్న అక్రమాలపై భవిష్యత్ కార్యాచరణతో పాటు రాయలసీమ ఎత్తిపోతల పథకం అంశంపై వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేపట్టనున్న నిరసన కార్యక్రమాలపై చర్చించారు.

 

అనంతరం డీఆర్వోను కలిసి ‘తల్లికి వందనం’ పథకం అమలులో జరిగినట్లు ఆరోపిస్తున్న అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి అర్హులైన లబ్ధిదారులకు న్యాయం చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.

 

ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు పోరెడ్డి నరసింహారెడ్డి, ఎమ్మెల్సీలు, బద్వేల్ ఎమ్మెల్యే దాసరి సుధ, జిల్లా నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!