
–26వ వార్డులో బాల వినాయక 32వ వార్షికోత్సవ వేడుకలు..
–అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న నూరి
సలాం ప్రొద్దుటూరు:
26వ వార్డు శాంతకుమారి వీధిలో శ్రీ శ్రీ శ్రీ బాల వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాల వినాయక 32వ వార్షికోత్సవ వేడుకల్లో టీడీపీ మైనారిటీ నాయకులు నూరి పాల్గొన్నారు. ఉత్సవ కమిటీ సభ్యులు గురు ప్రసాద్, హర్షవర్ధన్, సురేశ్ ప్రత్యేక ఆహ్వానం మేరకు జరిగిన అన్నదాన కార్యక్రమానికి ఆయన హాజరై భక్తులతో కలిసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు నూరిని ఘనంగా సన్మానించారు.
అనంతరం నూరి మాట్లాడుతూ.. వార్డులోని ప్రజలు కులమతాలకు అతీతంగా కలిసి బాల వినాయక ఉత్సవాలను నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. శ్రీ బాల వినాయకుని ఆశీస్సులతో 26వ వార్డులోని ప్రజలందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు.ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని వినాయకుడిని ప్రార్థించినట్లు నూరి తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఇస్మాయిల్, నాగరాజు, కుళ్లాయప్ప, షకీల్, చౌసేన్, గౌస్ మొహిద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
