ePaper
Saturday, September 5, 2026
ePaper
Homeఎడిటోరియల్బీసీ వర్గానికి చెందిన నస్యం నడిపెన్న హత్యను టీడీపీ బీసీ నేతలు మర్చిపోయారా?

బీసీ వర్గానికి చెందిన నస్యం నడిపెన్న హత్యను టీడీపీ బీసీ నేతలు మర్చిపోయారా?

📰 Generate e-Paper Clip

 

–“ఈ హత్య వెనుక ఉన్న వ్యక్తులు ఎవరో మీకు తెలియదా?”

 

– నస్యం శ్రీనివాసులు

 

సలాం ప్రొద్దుటూరు:

 

బీసీ సామాజికవర్గానికి చెందిన తన తండ్రి నస్యం నడిపెన్న హత్య ఘటనను టీడీపీకి చెందిన బీసీ నాయకులు మర్చిపోయారా? అని చెన్నంరాజుపల్లెకు చెందిన వైఎస్సార్‌సీపీ బీసీ నాయకుడు నస్యం శ్రీనివాసులు ప్రశ్నించారు. బీసీ వ్యక్తి హత్యకు గురైన సమయంలో రాజకీయాలకు అతీతంగా బీసీ నాయకులంతా ఎందుకు స్పందించలేదని ఆయన నిలదీశారు.

నస్యం నడిపెన్నను అత్యంత దారుణంగా హత్య చేసిన సమయంలో రాష్ట్రంలోని బీసీ సోదరులు ఎక్కడ ఉన్నారని శ్రీనివాసులు ప్రశ్నించారు. “ఆ ఘటనపై బీసీ నాయకులు ఒక్కసారైనా స్పందించి, హత్యను ఖండించి ఉంటే వారికి అభినందనలు తెలిపేవాడిని” అని పేర్కొన్నారు.

తన తండ్రి నడిపెన్నపై అనేక కేసులు ఉండటానికి కారణాలు ఏమిటి? ఆయన హత్య వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు? అనే అంశాలపై నిజానిజాలు వెలుగులోకి రావాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ విషయంపై బీసీ నాయకులకు సమాచారం ఉన్నప్పటికీ ఎందుకు ప్రశ్నించడం లేదని ఆయన ప్రశ్నించారు.

నడిపెన్న హత్య అనంతరం ప్రొద్దుటూరులో చోటుచేసుకున్న పలు హత్యలు, పరిణామాలపై కూడా సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉందని శ్రీనివాసులు అన్నారు. పట్టణంలో శాంతిభద్రతలు, యువత భవిష్యత్తు కోసం రాజకీయ పార్టీలు ముందుకు రావాలని కోరారు.

రాజకీయాలకు అతీతంగా బీసీలకు అండగా నిలవాలి

బీసీల అభివృద్ధి, సంక్షేమం కోసం అన్ని రాజకీయ పార్టీలకు చెందిన బీసీ నాయకులు పరస్పరం సహకరించుకోవాలని శ్రీనివాసులు సూచించారు. “మీ పార్టీలో ఉన్నప్పుడు మీరు బీసీలను ప్రోత్సహించండి.. మా పార్టీలో మేము ప్రోత్సహిస్తాం. బీసీలకు మేలు జరగడం మనందరి లక్ష్యం కావాలి” అని అన్నారు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విషయంలో తాను వ్యక్తిగతంగా గమనించిన కొన్ని విషయాలను శ్రీనివాసులు ప్రస్తావించారు. రాజకీయంగా తాను వైఎస్సార్‌సీపీలో ఉన్నప్పటికీ, బీసీల పట్ల రాచమల్లు కు ఉన్న అభిమానాన్ని తాను గుర్తించానని తెలిపారు. కులాల పేరుతో రాజకీయ విభేదాలను పెంచడం సరికాదన్నారు.

 

“వ్యక్తిగత విమర్శలు కాకుండా బీసీల అభివృద్ధిపై దృష్టి పెట్టాలి”

టీడీపీ నాయకుడు చల్లా రాజగోపాల్ యాదవ్ను ఉద్దేశించి కూడా శ్రీనివాసులు పలు వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగత సంబంధాలు, గతంలో ఒకరికొకరు ఇచ్చుకున్న గౌరవాన్ని గుర్తుంచుకుని రాజకీయ విభేదాలను వ్యక్తిగత స్థాయికి తీసుకెళ్లవద్దని సూచించారు.

బీసీ నాయకులంతా పరస్పరం విమర్శించుకోవడం కంటే తమ సామాజికవర్గానికి ఏ విధంగా మేలు చేయగలమనే దానిపై దృష్టి పెట్టాలని ఆయన కోరారు. బీసీలపై అన్యాయం జరిగినప్పుడు పార్టీ భేదాలను పక్కనపెట్టి ఐక్యంగా స్పందించాలని విజ్ఞప్తి చేశారు.

నడిపెన్న హత్యకు సంబంధించి తనకు ఉన్న ప్రశ్నలకు సమాధానాలు రావాలని, ఘటనపై నిజానిజాలు వెలుగులోకి రావాలని నస్యం శ్రీనివాసులు కోరారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!