ePaper
Wednesday, September 2, 2026
ePaper
Homeజాతీయంఖర్గేపై కుల వివక్ష దుర్మార్గం

ఖర్గేపై కుల వివక్ష దుర్మార్గం

📰 Generate e-Paper Clip

 

 

–రాహుల్‌ గాంధీపై కేసు పెట్టడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే– ఇర్ఫాన్‌ బాషా

 

సలాం  ప్రొద్దుటూరు:

ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీ రాంలీలా మైదానంలో ఏఐసీసీ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే పర్యటించిన అనంతరం సభా ప్రాంగణాన్ని శుద్ధి చేయడాన్ని కాంగ్రెస్‌ నాయకుడు ఇర్ఫాన్‌ బాషా తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన బహిరంగ కుల వివక్షకు, అంటరానితన భావజాలానికి నిదర్శనమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.జాతీయ స్థాయి నాయకుడిగా, పార్లమెంట్‌లో ప్రతిపక్ష నేతగా ఉన్న మల్లికార్జున ఖర్గే పట్లే ఇలాంటి వివక్షాపూరిత వైఖరి ప్రదర్శించడం అత్యంత అవమానకరమని ఇర్ఫాన్‌ బాషా పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమానత్వాన్ని కల్పిస్తుంటే, కులం పేరుతో వివక్ష చూపడం రాజ్యాంగ స్ఫూర్తిని, ప్రజాస్వామ్య విలువలను అవమానించడమేనని అన్నారు.

 

ప్రశ్నించిన రాహుల్‌పైనే ఎఫ్‌ఐఆర్‌ ఎందుకు?

 

కుల వివక్షకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ, అసలు ఘటనను ప్రశ్నించిన లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీపైనే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడం తీవ్ర అభ్యంతరకరమని ఇర్ఫాన్‌ బాషా అన్నారు.కుల వివక్షను ప్రశ్నించడం నేరమా? లేక కుల వివక్షకు పాల్పడటమే నేరమా? అని ఆయన ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష గొంతును అణచివేసేందుకు కేసులు, బెదిరింపులను ఉపయోగించడం సరికాదని స్పష్టం చేశారు.

 

అక్రమ కేసులతో రాహుల్‌ పోరాటాన్ని ఆపలేరు

 

బడుగు, బలహీన వర్గాలు, బీసీలు, మైనారిటీల హక్కుల కోసం రాహుల్‌ గాంధీ నిరంతరం పోరాడుతున్నారని ఇర్ఫాన్‌ బాషా అన్నారు. ఆయనపై ఎన్ని కేసులు పెట్టినా ప్రజా సమస్యలపై ఆయన గళం వినిపించడం ఆగదని పేర్కొన్నారు.రాహుల్‌ గాంధీని తక్కువగా అంచనా వేయడం బీజేపీ నాయకత్వం చేస్తున్న రాజకీయ తప్పిదమని ఆయన వ్యాఖ్యానించారు. అణచివేత చర్యలు ఆయన పోరాటాన్ని బలహీనపరచవు.. మరింత బలపరుస్తాయని అన్నారు.

 

తక్షణమే కేసు ఉపసంహరించాలి

 

మల్లికార్జున ఖర్గేపై జరిగిన కుల వివక్ష ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఇర్ఫాన్‌ బాషా డిమాండ్‌ చేశారు. అదే సమయంలో రాహుల్‌ గాంధీపై నమోదు చేసిన కేసును తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరారు.దేశంలో కుల వివక్షకు తావులేని సమాజాన్ని నిర్మించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, రాజ్యాంగ హక్కులు–సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్‌ పార్టీ తన పోరాటాన్ని కొనసాగిస్తుందని ఇర్ఫాన్‌ బాషా స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!