–ప్రజా సేవలో ఆమె అంకితభావం అభినందనీయం– ప్రముఖుల ప్రశంసలు
సలాం ప్రొద్దుటూరు – కడప:
కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని కడపకు చెందిన ప్రముఖులు ఆమెను కలిసి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛాలతో ఆమెను సత్కరించి, ప్రజా సేవలో ఆమె చేస్తున్న కృషిని అభినందించారు.కడప టీడీపీ సిటీ అధ్యక్షుడు పి. మాన్సూర్ అలీ ఖాన్, కడప నైట్ రైడర్స్ అధ్యక్షుడు, ఖూన్ కా రిష్తా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఎం. తారిక్ అలీ, కె జి ఎన్ ప్లానర్స్ & వాల్యుయర్స్ మేనేజింగ్ డైరెక్టర్ షేక్ జావీద్ కలిసి ఎమ్మెల్యే మాధవి రెడ్డిని మర్యాదపూర్వకంగా కలసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారం, కడప ప్రజల సంక్షేమం, సమాజ అభివృద్ధి పట్ల ఎమ్మెల్యే మాధవి రెడ్డి చూపుతున్న నిబద్ధత, అంకితభావం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రజలకు మరింత చేరువగా ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని, అన్ని వర్గాల సంక్షేమానికి మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు.మాధవి రెడ్డి ప్రజా సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో మరింత విస్తరించి, సమాజంలోని మరింత మందికి ప్రయోజనం చేకూర్చాలని వారు ఆకాంక్షించారు. ప్రజల విశ్వాసాన్ని మరింతగా పొందుతూ కడప అభివృద్ధికి ఆమె తన సేవలను కొనసాగించాలని కోరారు.అనంతరం మాధవి రెడ్డికి మంచి ఆరోగ్యం, ఆయురారోగ్యం, సుఖసంతోషాలు, ఐశ్వర్యం, శాంతి, విజయాలు కలగాలని వారు మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.
“మాధవి రెడ్డి గారికి సంపూర్ణ ఆరోగ్యం, సుఖసంతోషాలు కలగాలని, ప్రజలకు మరియు సమాజానికి మానవతా దృక్పథంతో మరింత సేవ చేసే శక్తి, అవకాశం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం” అని వారు తెలిపారు.

