–ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించిన టీడీపీ నాయకులు
సలాం ప్రొద్దుటూరు:
ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని 33వ వార్డు, బూత్ నంబర్ 129లో ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు వార్డులోని ప్రతి ఇంటిని సందర్శించి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ పాలనలో చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలను ఇంటింటికీ వెళ్లి వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి పార్టీ తరఫున కృషి చేస్తామని నాయకులు తెలిపారు.
ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేరవేయడమే ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నాయకులు పేర్కొన్నారు. కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో టీఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు చింతకుంట కుతుబుద్దీన్, మాజీ కౌన్సిలర్ గాజుల శివజ్యోతి, ఉత్తమ కార్యకర్త జహీరుద్దీన్, మహిళా నాయకురాలు సావిత్రి తదితరులు పాల్గొన్నారు.
