ePaper
Wednesday, September 2, 2026
ePaper
Homeఎడిటోరియల్విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన వేదికగా టీఎన్ఎస్ఎఫ్

విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన వేదికగా టీఎన్ఎస్ఎఫ్

📰 Generate e-Paper Clip

–ప్రొద్దుటూరులో భారీగా విద్యార్థుల చేరికలు..

–విద్యా అభివృద్ధిపై నమ్మకంతో యువత అడుగులు

 

సలాం    ప్రొద్దుటూరు:

విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పిస్తూ, విద్యా రంగ అభివృద్ధి మరియు యువతకు మెరుగైన అవకాశాల కోసం కృషి చేస్తున్న టీఎన్ఎస్ఎఫ్ వైపు విద్యార్థులు పెద్ద సంఖ్యలో అడుగులు వేస్తున్నారని జిల్లా అధ్యక్షులు బొజ్జ తిరుమలేష్ అన్నారు. ప్రొద్దుటూరులో టీఎన్ఎస్ఎఫ్‌లో భారీగా విద్యార్థుల చేరికలు జరగడం యువతలో పెరుగుతున్న విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు.మంగళవారం ప్రొద్దుటూరులో టీఎన్ఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చేతన్ కుమార్ రెడ్డి, టీడీపీ యువ నేత రసూల్ గౌస్ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో విద్యార్థుల సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బొజ్జ తిరుమలేష్ నూతనంగా టీఎన్ఎస్ఎఫ్‌లో చేరిన విద్యార్థులు, యువతకు కండువాలు కప్పి ఆత్మీయంగా స్వాగతం పలికారు.

విద్యార్థుల భవిష్యత్తుపై ప్రత్యేక దృష్టి

ఈ సందర్భంగా బొజ్జ తిరుమలేష్ మాట్లాడుతూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థులు, యువత భవిష్యత్తుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు, విద్యా రంగంలో ఆధునిక మార్పులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని తెలిపారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల నియామకంతో ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు చర్యలు చేపడుతున్నారని అన్నారు. విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధికి ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని తమ భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని పిలుపునిచ్చారు.

సమస్య పరిష్కారం వరకు విద్యార్థుల పక్షాన పోరాటం

ఫీజులు, స్కాలర్‌షిప్‌లు, హాస్టల్ వసతులు, కళాశాలల్లో మౌలిక సదుపాయాలు, పరీక్షలు, ఉద్యోగాలు, నైపుణ్యాభివృద్ధి వంటి అంశాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం సాధించే వరకు టీఎన్ఎస్ఎఫ్ విద్యార్థుల పక్షాన నిలుస్తుందని తిరుమలేష్ స్పష్టం చేశారు.

“విద్యార్థుల సమస్యను మా సమస్యగా భావించి.. వారి భవిష్యత్తు కోసం నిరంతరం కృషి చేస్తాం. ప్రతి విద్యార్థికి మంచి విద్య, మంచి అవకాశాలు అందేలా టీఎన్ఎస్ఎఫ్ ఒక బలమైన వేదికగా నిలుస్తుంది” అని ఆయన పేర్కొన్నారు.

విద్యార్థుల ఐక్యతే బలం

ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని అన్ని విద్యాసంస్థల్లో టీఎన్ఎస్ఎఫ్‌ను మరింత బలోపేతం చేసి విద్యార్థులను సంఘటితం చేస్తామని తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని కళాశాలల్లో సభ్యత్వ కార్యక్రమాలు నిర్వహించి, విద్యార్థుల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి కార్యాచరణ రూపొందిస్తామని వెల్లడించారు.ఈ సందర్భంగా మహమ్మద్, లక్ష్మీనారాయణ, పవాజు, బాలు, ఆసిఫ్, సాజిద్, సోమశేఖర్ తదితరులు టీఎన్ఎస్ఎఫ్‌లో చేరారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు కే. వంశీధర్, రామాంజనేయులు, సిద్ధార్థ రాయల్, వేణుగోపాల్ రెడ్డి, మహేష్, సందీప్, రంగనాథ్, హర్ష, సుమన్, సాదక్, రమేష్, శీను తదితరులు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!