సలాం ప్రొద్దుటూరు (తిరుపతి):
తిరుపతిలోని అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో అక్కారం పల్లి సమీపంలోని ఓ ఇంటిలో నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై పోలీసులు దాడులు నిర్వహించి నలుగురిని అరెస్ట్ చేశారు. ఈ దాడిలో ఇద్దరు మహిళలను రక్షించి ప్రభుత్వ హోంకు తరలించారు.
పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు నిర్వహించిన దాడిలో వ్యభిచార నిర్వహణకు సంబంధించిన రూ.1,500 నగదుతో పాటు 10 కండోమ్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో **సత్యనారాయణపురం రాజీవ్ నగర్కు చెందిన ఎం. అలివేలు మంగమ్మ (ఆర్గనైజర్)**తో పాటు ఎస్టీవీ నగర్కు చెందిన యు. గోవర్ధన్, కార్వేటినగరం గోపిశెట్టిపల్లికి చెందిన టి. తిరువేసు, నారాయణవనం మండలం అరణ్యకండ్రికకు చెందిన జి. సాయిబాబులను పోలీసులు అరెస్ట్ చేశారు.
రక్షించిన ఇద్దరు మహిళలను ప్రభుత్వ సంరక్షణ గృహానికి తరలించినట్లు తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలిస్తున్నట్లు అలిపిరి సీఐ రామకిషోర్ వెల్లడించారు. కేసుకు సంబంధించి మరింత దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
