ePaper
Sunday, July 19, 2026
ePaper
Homeఎడిటోరియల్ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్ చుక్ అరెస్ట్ సిగ్గు చేటు-ఎస్ఎఫ్ఐ

ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్ చుక్ అరెస్ట్ సిగ్గు చేటు-ఎస్ఎఫ్ఐ

📰 Generate e-Paper Clip

సలాం ప్రొద్దుటూరు (జమ్మలమడుగు):

 

ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్  ను బలవంతంగా అరెస్ట్ చేయడం సిగ్గు చేటు అని ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి హరి బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.శనివారం జమ్మలమడుగు పట్టణం లోని గాంధీ విగ్రహం దగ్గర శనివారం జమ్మలమడుగు పట్టణం లోని గాంధీ విగ్రహం వద్ద ఎస్ఎఫ్ఐ నిరసన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా హరి బాబు మాట్లాడారు.

నీట్ పేపర్ లీకేజీ కి భాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలన్నారు. అలాగే గత 20 రోజులుగా డిల్లీ లో సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ ఆమరణ నిరాహార దీక్ష కు కేంద్ర ప్రభుత్వం స్పందింఛ కుండా  ఈరోజు ఢిల్లీ లో అరెస్ట్ పై తీవ్రంగా వ్యతిరకం వ్యక్తం చేశారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హయంలో వరుసగా పేపర్ లీకేజీలు జరుగుతున్నాయని మండిపడ్డారు.ఒక్క నీట్ పేపర్ వరసగా లీకేజీ అవుతుందని అన్నారు.ఎన్ డి ఏ అసమర్థత స్పష్టంగా కనపడుతున్నారు.ఇది బీజేపీ జేబు సంస్థలాగా పని చేస్తుందని అన్నారు. ఎన్నో వేల, లక్షల మంది విద్యార్థులు మరియు తల్లిదండ్రుల కల ను నిరాశ కలిగించేలా చేశారన్నారు. పేపర్ లీకేజీ వల్ల 10 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని అన్నారు. ఇవన్ని కేంద్ర ప్రభుత్వ హత్యలే అన్నారు. నీట్ పేపర్ లీకేజీ కి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆయన రాజీనామా చేయాలని నీట్ పేపర్ లీకేజీ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గత 20రోజులుగా పర్యావరణవేత్త సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ప్రభుత్వం ఎటువంటి స్పందన లేకపోవడం దారుణం అన్నారు. అలాగే వారిని అరెస్ట్ చెయ్యడం ధరణం అని అన్నారు.సోనం వాంగ్ చుక్ కి ఏమి జరిగినా అది కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుంది అన్నారు. ఇప్పటికే సామాజిక కార్యకర్త సోనం వాంగ్ చుక్ ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా ప్రమాదకర స్థితిలో ఉన్నదని ప్రభుత్వం స్పందించి ఆయనతో చర్చలు జరపకుండా ఇలా అరెస్ట్ చేస్తే ప్రజా స్వామ్యం లో హక్కులు అడిగేందుకు స్వీచ్చ కోల్పోతామణి అన్నారు.కేంద్ర విద్యా శాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జిల్లా మరియు రాష్ట్ర,దేశవ్యాప్తంగా వేల మంది విద్యార్థులతో కేంద్ర విద్యా శాఖ మంత్రి ఇంటి ముట్టడైన చేస్తామని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ పట్టణ నాయకులు దస్తగిరి, దూదవల్లి, సాగర్, చరణ్, మధు, యస్వంత్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install SLMPDR News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!