సలాం ప్రొద్దుటూరు (కడప):
కడప జిల్లా పర్యటనకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు కడప విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది.
ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సి.ఎం. సురేష్ నాయుడు మంత్రి నారా లోకేష్ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి ఆహ్వానం పలికారు. జిల్లా పర్యటన విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని మంత్రి లోకేష్కు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం పరిసరాలు పార్టీ శ్రేణుల సందడితో కళకళలాడాయి.
