సలాం ప్రొద్దుటూరు:
స్థానిక జమ్మలమడుగు బైపాస్ రోడ్డులోని శ్రీదేవి ఫంక్షన్ హాల్ పక్కన నిర్మించనున్న భారత్ ఎంటర్ప్రైజెస్ గ్రానైట్, మార్బుల్ & టైల్స్ వ్యాపార సముదాయం భవన నిర్మాణానికి సోమవారం ఘనంగా భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ స్టేట్ షేక్ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. వి.ఎస్. ముక్తియార్ కొబ్బరికాయ కొట్టి భూమిపూజ నిర్వహించి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా డా. ముక్తియార్ మాట్లాడుతూ, భారత్ ఎంటర్ప్రైజెస్ సంస్థ వ్యాపారంలో మరింత అభివృద్ధి సాధించి ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. అనంతరం సంస్థ నిర్వాహకులు డా. ముక్తియార్ను ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలు, ప్రముఖులు, సంస్థ ప్రతినిధులు, అభిమానులు పాల్గొన్నారు.
