–దాల్మియా సిమెంట్ ప్లాంట్ విస్తరణ పనులకు శంకుస్థాపన.. ప్రొద్దుటూరు సమీపంలోనూ పర్యటన
సలాం ప్రొద్దుటూరు:
రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఈ నెల 14, 15 తేదీల్లో వైఎస్సార్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు అధికారిక పర్యటన షెడ్యూల్ విడుదలైంది.
జూలై 14 (మంగళవారం) సాయంత్రం 6 గంటలకు కడప విమానాశ్రయానికి చేరుకోనున్న మంత్రి లోకేష్, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి రాత్రి 7:45 గంటలకు జమ్మలమడుగు నియోజకవర్గంలోని కరమలవారిపల్లి (గూటి–నెల్లూరు హైవే) వద్దకు చేరుకుంటారు. అనంతరం అక్కడే రాత్రి బస చేయనున్నారు.
జూలై 15 (బుధవారం) ఉదయం 9:15 గంటలకు కరమలవారిపల్లి నుంచి బయలుదేరి, 9:30 నుంచి 11:30 గంటల వరకు మైలవరం మండలం చిన్నకొమర్ల గ్రామంలోని దాల్మియా సిమెంట్ ప్లాంట్ విస్తరణ పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు.
అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు జమ్మలమడుగు నుంచి బయలుదేరి, 2:45 గంటలకు ప్రొద్దుటూరు సమీపంలోని దొరసానిపల్లి గ్రామం (బొల్లవరం రూరల్) చేరుకుంటారు. అక్కడ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రిజర్వ్ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
తదుపరి సాయంత్రం 5 గంటలకు దొరసానిపల్లి నుంచి కడప విమానాశ్రయానికి బయలుదేరి, 5:50 గంటలకు చేరుకుంటారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు విజయవాడకు విమానంలో బయలుదేరనున్నట్లు అధికారిక షెడ్యూల్లో పేర్కొన్నారు.
