సలాం ప్రొద్దుటూరు :
ఉపవిద్యాశాఖాధికారి మీనాక్షిని విధుల నుంచి తప్పిస్తూ పాఠశాల విద్య రాష్ట్ర ప్రధాన కార్యా లయం డైరెక్టర్ తమీమ్ అన్సారియా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఆమె ఇన్ ఛార్జి డీఈవోగా పని చేసిన సమయంలోనూ వివాదాస్పద అధికారికారిగా ఉండటంతో అప్పట్లో ‘ఈ డీఈవో మాకొద్దు’ అనే నినాదంతో ఉపాధ్యాయ సంఘాలు ఉద్యమించాయి. దీంతో ఆమెను బాధ్యతల నుంచి తప్పించి ప్రొద్దుటూరు ఉప విద్యాశాఖాధికారిగా కొనసాగించారు. అక్కడా ఆరోపణల పర్వం కొనసాగడంతో ఇటీ వల నిర్వహించిన డీఆర్సీ సమావేశంలో ఆమె విధుల పట్ల అలసత్వం ప్రదర్శిస్తున్నారని పట్టభద్రుల ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఆరో పిస్తూ ఆమెకు వ్యతిరేకంగా తీర్మానం చేశారు. అనంతరం ఆర్జేడీ విచారించి నివేదికను ప్రభు త్వానికి సమర్పించగా వేటు పడింది
