సలాం ప్రొద్దుటూరు:
సోమవారం స్థానిక శేగిరెడ్డి కళ్యాణమండపంలో వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు, వైఎస్ఆర్సిపి కార్యకర్తలు, వైయస్సార్ అభిమానులు దిగవంత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి చేసిన సేవలు , తెచ్చిన గొప్ప సంక్షేమ పథకాలు గుర్తు చేసుకున్నారు. వైయస్సార్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ ,108 తదితర పథకాల వల్ల లక్షలాది మంది ప్రాణాలతో జీవిస్తున్నారని వారు తెలిపారు. లక్షల కుటుంబాలలో వెలుగునిచ్చిన నేత డాక్టర్ వైయస్సార్ అని కొనియాడారు. రాజన్న రాజ్యం జగనన్న ద్వారా మరొకసారి రావాలని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
