సలాం ప్రొద్దుటూరు:
ప్రొద్దుటూరు ఎం పీ జే పట్టణ అధ్యక్షులు హుస్సేన్ భాష ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ నూతన మేనేజర్ మహబూబ్ బాషాను బుధవారం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీజే రాయలసీమ ఇన్చార్జ్ డా. ఎండి అయూబ్ ఖాన్, ఎంపీజే జిల్లా ఇన్చార్జ్ జాకీర్ ఉమ్రి పాల్గొని నూతన బాధ్యతలు స్వీకరించిన మేనేజర్కు శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం ఆయన సేవలు ప్రజలకు మరింత చేరువ కావాలని ఆకాంక్షిస్తూ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీజే సభ్యులు ఎస్పీ ముక్తియార్, ఖాదర్ వలీ, అల్లాబాకాష్, ఫరాన్ తదితరులు పాల్గొన్నారు.
