సలాం ప్రొద్దుటూరు:
మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వారోత్సవాల ముగింపు సందర్భంగా ప్రొద్దుటూరు పట్టణంలో మెగా అభిమానుల ఆధ్వర్యంలో శనివారం కేక్ కటింగ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక వీరబ్రహ్మేంద్ర ఆశ్రమంలో ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా ప్రొద్దుటూరు పట్టణ చిరంజీవి అభిమానుల అధ్యక్షుడు రామారావు మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. చిరంజీవిపై తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తూ, మరొక జన్మ ఉంటే కూడా చిరంజీవి అభిమానులుగా పుట్టాలని దేవుడిని కోరుకుంటున్నామని తెలిపారు.కార్యక్రమంలో మెగా అభిమానులు రామారావు, షరీఫ్ టైర్స్, చంద్రధర్, చల్లా రవికుమార్, సాగర్, బియ్యం కేశవ, జనసేన అడ్వకేట్ రమేష్, నెట్ బాషా, సుదర్శన్, ఇమామ్, బాబు రావు, చెన్న రవి, రాము, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు.
