
–విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేసిన సూర్య సమాజ సేవ హెల్ప్ సొసైటీ
సలాం ప్రొద్దుటూరు:
80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పెన్నానగర్లోని ప్రభుత్వ పాఠశాలలో జాతీయ జెండాను ఆవిష్కరించి ఘనంగా వేడుకలు నిర్వహించారు. అనంతరం సూర్య సమాజ సేవ హెల్ప్ సొసైటీ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా విద్యార్థులకు స్వాతంత్ర్య దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. సమాజ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, చిన్నారుల్లో దేశభక్తి, సామాజిక బాధ్యతను పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని నిర్వాహకులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, సూర్య సమాజ సేవ హెల్ప్ సొసైటీ వ్యవస్థాపకులు, కమిటీ సభ్యులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.పాల్గొన్న సొసైటీ ప్రతినిధులు N. షరీఫ్ — వ్యవస్థాపకులు, అధ్యక్షులు,S. షరీఫ్ (కవి) — ఉపాధ్యక్షులు,G. ఖాసిం పీరా — కార్యదర్శి,C. శేషారెడ్డి — సంయుక్త కార్యదర్శి,M. సుధాకర్ — కోశాధికారి.

