సలాం ప్రొద్దుటూరు:
ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి పార్టీ క్యాడర్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని 52 వార్డులతో పాటు మండలాల వారీగా పార్టీ కార్యక్రమాలు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన అంశాలపై నాయకులతో చర్చించారు.కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని ఎమ్మెల్యే నాయకులు, కార్యకర్తలకు సూచించారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మున్సిపాలిటీతో పాటు మండలాల్లో పార్టీ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో చురుకుగా పనిచేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ప్రతి వార్డులో ప్రజల సమస్యలను తెలుసుకుని, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.సమావేశంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

