–ట్రాన్స్ఫార్మర్లో సాంకేతిక లోపంతో ఇబ్బందులు
సలాం ప్రొద్దుటూరు – చాపాడు:
మండల కేంద్రమైన చాపాడులో మంగళవారం ఉదయం 5 గంటల నుంచి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ట్రాన్స్ఫార్మర్లో ఏర్పడిన సాంకేతిక లోపం కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు తెలుస్తోంది.
ఉదయం నుంచి విద్యుత్ సరఫరా లేకపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఇళ్లలో విద్యుత్ ఆధారిత పనులు, తాగునీటి సరఫరా తదితర అంశాలపై ప్రభావం పడుతున్నట్లు ప్రజలు తెలిపారు.
విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి ట్రాన్స్ఫార్మర్లోని సాంకేతిక లోపాన్ని గుర్తించి మరమ్మతులు చేపట్టి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు.
