
–మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి చేతుల మీదుగా ప్రారంభం
సలాం ప్రొద్దుటూరు:
పట్టణంలోని 2 టౌన్ బైపాస్ రోడ్డులో బయోఫ్యాక్టర్ సమగ్ర రైతు సేవా కేంద్రాన్ని మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి ప్రారంభించారు. రైతులకు అవసరమైన ఎరువులు, వ్యవసాయ సంబంధిత ఉత్పత్తులు అందుబాటులో ఉండేలా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆయన అన్నారు. రైతులకు నాణ్యమైన సేవలు అందించాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో కేఎస్ కెనాల్ ప్రాజెక్ట్ కమిటీ వైస్ చైర్మన్ ద్వార్శల గురివిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పట్నం లక్ష్మణ్కుమార్, వ్యవసాయ శాఖ ఏడీ అనిత, ఏవో వరహరి, రైతులు తదితరులు పాల్గొన్నారు.

