సలాం ప్రొద్దుటూరు – కల్లూరు:
కల్లూరు గ్రామంలో దివంగత రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలను పార్లమెంటరీ రాష్ట్ర కార్యదర్శి నాగేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాలకు పాలాభిషేకం నిర్వహించి, అనంతరం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం కార్యక్రమానికి హాజరైన నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులకు అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి సేవలను స్మరించుకుంటూ పలువురు నాయకులు ఆయనకు నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో నాగ సుబ్బారెడ్డి, ఓబుల్ రెడ్డి, కిరణ్, రాజా యాదవ్, సుబ్రహ్మణ్యం, బీసీ యాదవ్తో పాటు పలువురు గ్రామ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

