సలాం ప్రొద్దుటూరు:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో పనిచేస్తున్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పార్ట్ టైమ్ / గెస్ట్ టీచర్స్ & లెక్చరర్స్ మంగళవారం ఎమ్మెల్యే స్వగృహంలో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యేకు తమ సమస్యల గురించి వివరించారు. పెండింగ్ లో ఉన్న జీతాల విడుదల, నెలనెలా జీతాల చెల్లింపు,ఉద్యోగ భద్రత కల్పన మరియు సంక్షేమ పథకాల అర్హత పునరుద్ధరణ గురించి ఎమ్మెల్యే కు వినతి పత్రం ద్వారా విన్నవించుకున్నారు.
