సలాం ప్రొద్దుటూరు:
ఆదివారం 12వ అంతర్జాతీయ యోగ డే సందర్భంగా అల్లాడుపల్లి శ్రీ భద్రకాళి సమేత శ్రీవీరభద్ర స్వామి సన్నిధిలో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఘనంగా యోగా దినోత్సవం జరిగింది.యోగా గురువు రఘురామిరెడ్డి స్కూలు విద్యార్థులు , సభ్యులతో కలిసి యోగాసనాలు చేశారు. ఈ యోగాసనాలు మన దైనందిత జీవితంలో ప్రతి ఒక్కరూ చేసుకోవలసిన దినచర్య అని ఆయన తెలిపారు.వాసవి క్లబ్ తరపున పూజ స్వామిని శివ దర్శనానంద సరస్వతి మాతాజీ , యోగ గురువు రఘురామిరెడ్డి కు సన్మానం చేశారు . యోగాలో పాల్గొన్న అందరికీ ఖర్జూర పండ్లు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో IEC ఆఫీసర్ దొంతు సుబ్రమణ్యం , జిల్లా క్యాబినెట్ సెక్రెటరీ (సర్వీస్)పబ్బతి గోపాల్ , IPC: సూరే సుబ్బరాజ , వాసవి క్లబ్ ప్రెసిడెంట్ సందిపూటి సతీష్ కుమార్ ,క్లబ్ సెక్రెటరీ బొగ్గరపు గురు ప్రసాద్, క్లబ్ ట్రెజరర్ చింతకుంట చంద్ర కిషోర్ , వాసవి క్లబ్ సభ్యులు బొమిడాల శుభాకర్ , చింతకుంట కేశవ , శ్రీ అల్లాడుపల్లె వీరభద్ర స్వామి ఆలయ చైర్మన్ పెరుగు నారాయణ యాదవ్ వారి బృందం పాల్గొన్నారు.
