ప్రొద్దుటూరు పట్టణం లోనీ బంగారు మార్కెట్ లో ఉన్న తనకంటి జ్యువెలర్స్ వద్ద శుక్రవారం తమకు మోసం జరిగిందని మహిళలు నిరసన కార్యక్రమం చేశారు. యాజమాన్యం మహిళలు ఖాతాదారుల నుంచి నెలవారి వాయిదా పద్ధతిలో డబ్బులు వసూలు చేసి తమకు బంగారు నగల స్కీమ్ రూపంలో ఇస్తామని నమ్మబలికి చెప్పిన గడువు ముగిసిన కూడా తమకు బంగారు ఇవ్వ కుండా కాలయాపన చేస్తున్నారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
RELATED ARTICLES
