సలాం ప్రొద్దుటూరు:
ఇంటి నిర్మాణ పరికరాల దొంగను గురువారం మధ్యాహ్నం ఆర్టిపిపి క్రాస్ రోడ్ వద్ద అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 50 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు వన్ టౌన్ ఎస్సై శ్రీనివాసులు తెలిపారు.వివరాల మేరకు.. స్థానిక మట్టి మసీదు వీధిలో షేక్ మహబూబ్ బాషా ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో షేక్ అబ్దుల్ సుబహానీ ఇద్దరు మైనర్ బాలురతో కలిసి బీగాలు పగలగొట్టి బీరువాలోని రూ.50 వేలు చోరీ చేశారు. వీరిని గురువారం అరెస్టు చేసి రిమాండ్ పంపారు.
