సలాం ప్రొద్దుటూరు (కడప ):
–వినాయక నగర్ వద్ద చోటు చేసుకున్న దారుణ ఘటన.!
కడప నగరంలోని వినాయక నగర్ ప్రాంతంలో బుధవారం దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ పసికందును ఎవరో తల్లిదండ్రులు ముళ్ళ పొదల్లో వదిలేసి పోయారు. కుక్కలు కొన్ని పసికందును ఎత్తుకెళ్తుండగా స్థానికులు గమనించి కుక్కను తరిమికొట్టారు. అప్పటికే ఆ చిన్నారి మృతి చెందినట్లు స్థానికులు కొందరు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
