సలాం ప్రొద్దుటూరు:
కడప జిల్లా పర్యటన నిమిత్తం విచ్చేసిన రాష్ట్ర మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్కు కడప విమానాశ్రయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర షేక్ కార్పొరేషన్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. వి.ఎస్. ముక్తియార్ మర్యాదపూర్వకంగా ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా డా. వి.ఎస్. ముక్తియార్ మంత్రి లోకేష్కు పుష్పగుచ్ఛం అందించి ఆత్మీయంగా అభివాదం చేశారు. అనంతరం జిల్లా అభివృద్ధి, ప్రభుత్వ కార్యక్రమాల అమలు, ప్రజా సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలపై స్వల్పంగా చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
