సలాం ప్రొద్దుటూరు :
మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని స్థానిక శేగిరెడ్డి కల్యాణమండపంలో సోమవారం కూటమి ప్రభుత్వం వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా ఫోటో ఎగ్గిబిషన్ , LED స్క్రీన్ల ద్వారా చంద్రబాబు చేసిన మోసాలను మాజీ ఎమ్మెల్యే రాచమల్లు నాయకులకు ,మహిళలకు, కార్యకర్తలకు వివరించారు. చంద్రబాబు,పవన్ కళ్యాణ్,నారాలోకేష్ ఫోటోలతో ఇచ్చిన హామీల గురించి వినం,చూడం,మాట్లాడం పోస్టర్ కు కార్యకర్తల నుండి విశేష స్పందన లభించింది.ఈ కార్యక్రమంలో నియోజకవర్గం వైయస్ఆర్సీపీ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు,అనుబంధ విభాగాల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
