సలాం ప్రొద్దుటూరు (హిందూపురం):
* శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం-దేవరపల్లి రైల్వే స్టేషన్ల మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుకు ఘోర ప్రమాదం తృటిలో తప్పింది.
* ఢిల్లీ నుంచి రైలు బెంగళూరుకు బయలుదేరిన వందే భారత్ రైలు మార్గమధ్యంలోని దేవరపల్లి సమీపానికి రాగానే ఓ ఆవు అడ్డు రావడంతో వేగంగా వచ్చిన రైలు ఢీకొని అక్కడిక్కడే మృతి చెందింది.
* రైలు ముందు భాగం బాగా దెబ్బతింది.
* అయితే పైలెట్ సమయస్ఫూర్తితో అదృష్టవశాత్తు ప్రయాణికులకు ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరక్కపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
* అయితే వేగంగా వెళ్తున్న రైలు ఒక్కసారిగా ఆగిపోవడంతో ఏం జరిగిందో తెలియక అందరూ ఆందోళనకు గురయ్యారు.
* ఈ మార్గంలో గంటపాటు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది.
