సలాం ప్రొద్దుటూరు (మైదుకూరు):
మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరమ్మ కాలనీ లో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.ఆదివారం తెల్లవారు జామున నాగేంద్ర అనే యువకున్ని గుర్తు తెలియని దుండగులు మొహంపై పొడిచి దారుణంగా హత్య చేశారు.మృతుడికి భార్య కుమార్తె ఉన్నారు. భార్యతో మనస్పర్థలు ఉన్న కారణంగా కొన్ని రోజుల నుంచి అమ్మగారి ఇంటి వద్ద ఉంటుందనీ తెలిపిన స్థానికులు మృతుడు ఆటో డ్రైవర్.. కూలి పని చేసుకుంటూ గుడి ఆవరణలో పడుకునే వాడని తెలిపిన స్థానికులు. మైదుకూరు అర్బన్ సీఐ రమణారెడ్డి, ఎస్ ఐ చిరంజీవి ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
