సలాం ప్రొద్దుటూరు:
కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన సందర్భంగా చేపట్టిన ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమంలో భాగంగా ప్రొద్దుటూరు పట్టణంలోని 25వ వార్డులో టీడీపీ మైనారిటీ నాయకుడు నూరి ఆధ్వర్యంలో డోర్ టు డోర్ ప్రచారం మంగళవారం నిర్వహించారు.
ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి, టీడీపీ యువ నాయకుడు నంద్యాల కొండా రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాయకులు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వారి అభిప్రాయాలను సేకరించారు.
ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్చార్జి తలారి రమేష్, బూత్ ఇన్చార్జి హర్ష, వార్డు టీడీపీ నాయకులు పీవీ మాగబుల్, నాగరాజు, సురేష్, జాఫర్, యాసిన్ బహదూర్తో పాటు ఇతర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
