సలాం ప్రొద్దుటూరు (స్పోర్ట్స్):
వైయస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులోని స్థానిక పాలిటెక్నిక్ కళాశాల గ్రౌండ్ లో ట్రైనర్ కే .నాగేశ్వరరావు రోలర్ స్కేటింగ్ శిక్షణ నిర్వహిస్తున్నారు.ఇక్కడ శిక్షణ పొందిన విద్యార్థులు మే నెల 31వ తేదీ కర్ణాటక రాష్ట్రం లో జరిగిన జాతీయ స్కేటింగ్ పోటీలలొ పాల్గొన్నారు .18 మంది విద్యార్థులు హాజరుకాగా, అందులో 10మంది గోల్డ్ మెడల్స్, 5గురు సిల్వర్ మెడల్స్, ముగ్గురు బ్రాంజ్ మెడల్స్ సాధించారు .ఓవరాల్ ఛాంపియన్షిప్ లో ప్రొద్దుటూరు రోలర్ స్కేటింగ్ అకాడమీ విద్యార్థులు జాతీయస్థాయిలో 3వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా స్కేటింగ్ శిక్షకుడు నాగేశ్వరరావు మాట్లాడుతూ స్కేటింగ్ వల్ల విద్యార్థులకు కృషి పట్టుదలతో పాటు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని ,ఏకాగ్రత ఏర్పడుతుందని అన్నారు. తమ విద్యార్థులు పథకాలను కైవసం చేసుకున్నందుకు ఆయన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
