సలాం ప్రొద్దుటూరు:
మంత్రి నారా లోకేష్ బుధవారం మైదుకూరు ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ నివాసానికి వచ్చిన సందర్భంగా టీడీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆయనతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఉత్సాహం చూపగా, లోకేష్ ఆత్మీయంగా వారితో మమేకమయ్యారు. ఈ సందర్భంగా పలువురు ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన వినతిపత్రాలను ఆయనకు అందజేశారు. వాటిని స్వీకరించిన లోకేష్ సంబంధిత అధికారులతో పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అభిమానుల రాకతో పుట్టింటి పరిసరాలు సందడిగా మారాయి.
