- సలాం ప్రొద్దుటూరు (కొండాపురం):
వైఎస్ఆర్సిపి జమ్మలమడుగు పరిశీలకుడు పోరెడ్డి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో గురువారం కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా హాజరైన జమ్మలమడుగు పరిశీలకుడు పోరెడ్డి నరసింహారెడ్డి మాట్లాడుతు కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ అట్టర్ ప్లాప్ కావడంతో ప్రజలు తిరస్కరించే పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడిందన్నారు.రాష్ట్రంలో ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వని దుర్మార్గమైన పరిస్థితి కూటమి ప్రభుత్వంలో ఏర్పడిందన్నారు.సూపర్ సిక్స్ పథకాల్లో ఏ ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు మేలు జరగలేదన్నారు.చంద్రబాబు కరెంట్, పెట్రోల్, కూరగాయలు వంటి రేట్లు పెంచారన్నారు.అందుకే ఇవాళ వెన్నుపోటుకు రెండేతు విరసన కార్యక్రమం చేపట్టామని తెలిపారు. అనంతరం కొండాపురం మండల వైస్సార్సీపీ పార్టీ కార్యాలయం నుంచి ప్లకార్లడ్ తో ర్యాలీ. వైఎస్ఆర్సిపి నాయకులు చంద్రబాబు డౌన్ డౌన్ అంటూనినాదాలు.నిరసన కార్యక్రమంలో టిడిపి సూపర్ సిక్స్ హామీలు, మేనిఫెస్టో ప్రతులను దగ్ధం చేసిన వైఎస్ఆర్సీపీ శ్రేణులుఈ కార్యక్రమం లో గండ్లూరు నారాయణ రెడ్డి , శ్రీరంగనాధ రెడ్డి , కోడూరు శివారెడ్డి, నవజ్యోతి రెడ్డి , అమర్ నాధ్ రెడ్డి , నరేష్ రెడ్డి , ఎద్దుల శేఖర్ , ప్రతాప్ రెడ్డి , హరినారాయణ రెడ్డి ఇతర నాయకులు లో పాల్గొన్నారు.
