సలాం ప్రొద్దుటూరు:
ప్రొద్దుటూరు నడిబొడ్డున వెలసిన అగస్త్యేశ్వరాలయంలో నేటి నుంచి మహా కుంభాభిషేక మహోత్సవం ఆలయ ఈఓ కె.వి. రమణ, పాలకమండలి చైర్మన్ వంగల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభమవు తున్నట్లు అర్చకులు తెలిపారు. ఆదివారం స్థానిక ఆలయంలో అర్చకులు సతీష్ శర్మ, ఉదయ భాస్కర్, పాలకమండలి సభ్యులు దేవర శెట్టి నాగ విక్రాంత్ ఆధ్వర్యంలో విలేఖరుల సమావేశం నిర్వహించి ఆహ్వాన పత్రికలు ఆవిష్కరించారు. నేటి కార్యక్రమాలు వేద మంత్రోచ్చా రణలు, మంగళ వాయిద్యాలతో ప్రారంభమవుతాయని తెలిపారు. దైవానుజ్ఞ, బ్రాహ్మణానుజ్ఞ, యాగశాల అలంకరణ, నవకలశ స్థాపన, ఆలయ ప్రదర్శన వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మంగళవారం ఉదయం వేదస్వస్తి, గోపూజ, మహాగణాధిపతి పూజ, పుణ్యాహవచనం, పంచగవ్యా రాధన, మార్జనలు, రుత్విక్ వరణ, దీక్షారాధన, అఖండ స్థాపన, త్రిశూల పూజ, షోడశ కలశ స్థాపన, నీరాజనం, తీర్థప్రసాద వితరణ, అదే రోజు సాయంత్రం మృత్సం గ్రహణం, అంకురార్పణ, అగ్ని ప్రతిష్టాపన, యాగశాల కుంభాలంకరణ, ప్రధాన కలశ స్థాపన, రుద్రహోమం, మూలమంత్ర హోమాలు, బుధవారం గవ్యాంతర పూజలు, మార్జనలు, వాస్తు పూజ, వాస్తు బలి, పర్యగ్నికరణలు, పంచవింశతి కలశ స్నపనలు, శ్రీచక్రార్చన, గణపతి, మూల మంత్ర జపం, తర్పణం, హోమాలు, రుద్రహోమం, నీరాజనం, తీర్థప్రసాద వితరణ, సాయంత్రం యాగశాలార్చనలు, నవగ్రహ హోమాలు, వేదస్వస్తి కార్యక్రమాలు, గురువారం ఉదయం గవ్యాంతర పూజలు, మార్జనలు, సుబ్రహ్మణ్య మూలమంత్ర జపం, తర్పణం, హోమాలు, రుద్రహోమం, పంచవింశతి కలశ స్నపనం, సాయంత్రం యాగశాలార్చనలు, సుదర్శన హోమం, శుక్రవారం శ్రీ విద్యా పారాయణం, శ్రీ చండీ పారాయణం, మూలమంత్ర జపం, తర్పణం, హోమాలు, అష్టోత్తర కలశ స్నపనలు, కళా హోమం, మూర్తి హోమం, శాంతి హోమం, దిశా హోమం, తత్త్వానుసంధాన హోమాలు, వేదస్వస్తి, నీరాజనం, తీర్థప్రసాద వితరణ జరుగుతాయని వివరించారు. 20వ తేదీ శనివారం ఉదయం గవ్యాంతర పూజలు అనంతరం 7:53 గంటలకు కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి చేతుల మీదుగా మహా కుంభాభిషేకం నిర్వహించనున్నామని తెలిపారు. అనంతరం మూలవిరాట్టులకు పూజలు, స్వామివారి అనుగ్రహ భాషణం, ఉదయం 10 గంటలకు శాంతి కళ్యాణం, 12:30కి అన్నప్రసాద వితరణ జరుగుతుందని, సాయంత్రం 5:30 గంటల నుంచి స్వామి అమ్మవార్ల గ్రామోత్సవం నిర్వహించనున్నట్లు వివరించారు. దాదాపు 40 సంవత్సరాలుగా ఈ మహోత్సవం జరగలేదని అధికారులు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు శంకర్ కుమార్, దేవర శెట్టి నాగ విక్రాంత్, అవ్వారు చిన్న వెంకట రమణ, బాబు, వుట్టి లక్ష్మీనారాయణ, నాగరాజు, ఎక్స్ ఆఫిషియో సభ్యులు మహేశ్వర శర్మ, అర్చకులు సతీష్ శర్మ, ఉదయ భాస్కర్, స్వరూప్, వేద పాఠశాల గురువు వెంకటేశ్ శర్మ తదితరులు పాల్గొన్నారు.
