ePaper
Saturday, July 25, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి

రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి

📰 Generate e-Paper Clip

 

సలాం ప్రొద్దుటూరు :

ప్రొద్దుటూరు పట్టణంలోని మైదుకూరు రోడ్డులో జరుగుతున్న నూతన రోడ్డు నిర్మాణ పనులను స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్న ఆయన, పనులు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.

 

ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రోడ్డు నిర్మాణంలో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకుండా పనులు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.

 

ఈ పరిశీలన కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సభ్యులు తోట మహేశ్వర రెడ్డి, సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install SLMPDR News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!