SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 11 September 2026, 5:20 pm Posted by : SALAM PRODDATUR

ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డితో రాష్ట్ర చైల్డ్ వెల్ఫేర్ కమిషనర్ భేటీ

 

–స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసిన ఎ పి ఎస్ సి పి సి ఆర్ కమిషనర్ కేజీ వెంకట పద్మలత

 

సలాం  ప్రొద్దుటూరు:

రాష్ట్ర చైల్డ్ వెల్ఫేర్ కమిషనర్ (APSCPCR) కేజీ వెంకట పద్మలత ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డిని శుక్రవారం ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డితో కమిషనర్ వెంకట పద్మలత పరస్పరం మర్యాదపూర్వకంగా మాట్లాడారు. రాష్ట్రంలో బాలల సంక్షేమం, వారి హక్కుల పరిరక్షణకు సంబంధించిన అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం.ఎమ్మెల్యేను రాష్ట్రస్థాయి ప్రజాప్రతినిధిగా మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర చైల్డ్ వెల్ఫేర్ కమిషనర్‌ భేటీకి రాజకీయ, సామాజిక వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.ఈ భేటీలో టీడీపీ యువనాయకులు నంద్యాల కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు.